ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంగవరాన్ని వెంటాడుతోన్న చిరుత భయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2019, 12:08 PM

పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం గంగవరం అటవీ ప్రాంతంలో గ్రామస్తులను చిరుతపులి భయం వెంటాడుతోంది. దీని విషయమై గ్రామస్తులంతా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై గంగవరం గ్రామ ప్రజలు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాత్రి సమయాల్లో పాడి గేదెలు అరుస్తున్నాయని.. ఏమైందో చూసేందుకు ఆ పాడి గేదెల యజమానులు వెళ్లి చూస్తుంటే.. యజమానుల అలికిడితో ఏదో ఒక జంతువు పారిపోతుందని చెబుతున్నారు. అది ఏ జంతువు అనే విషయం తెలియదని, చిరుతపులి అయి ఉండవచ్చని గ్రామస్తులు భయాందోళన వ్యక్తపరిచారు. అధికారులు వచ్చి దాన్ని పట్టుకొని నిర్ధారించవలసి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com