రూల్ ప్రకారం సభ్యులు అనుమతి తీసుకొని మాట్లాడాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శాసన సభలో స్పీకర్ మాట్లాడుతూ ఛైర్ అనుమతితోనే అనుబంధ ప్రశ్నలు అడగాలన్నారు. ప్రశ్నోత్తరాల్లో.. ప్రశ్నలు ఎవరు పంపుతున్నారో వారికే మాట్లాడే అవకాశం ఉంటుందని, అలా కాకుండా వేరే వాళ్లు మాట్లాడాలనుకుంటే సభాపతి నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. స్పీకర్ స్థానానికి ఎవరైనా గౌరవం ఇవ్వాలన్నారు.