అమరావతి: ఏపీ అసెంబ్లి సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో సీట్ల కేటాయింపు రగడ జరిగింది. అచ్చెన్నాయుడికి సీటు కేటాయింపుపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని చంద్రబాబు కోరారు. నిబంధనల ప్రకారమే అచ్చెన్నాయుడుకు సీటు కేటాయించామని అధికార పక్షం పేర్కొంది. స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారం పరిశీలించి సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.