ఏపీ గవర్నర్ గా ఒడిశాకు చెందిన మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బిశ్వభూషణ్ హరిచందన్ ను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ గవర్నర్ నరసింహన్ ను ఏ క్షణంలోనైనా మార్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. నరసింహన్ పదవీకాలం ముగిసినట్టే అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆయన స్థానంలో బీజేపీకి చెందిన కొత్త గవర్నర్ రాబోతున్నారని తెలుస్తోంది.ఇరు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఉన్న నరసింహన్ అధికారాలకు కేంద్ర ప్రభుత్వం కోత పెట్టిన సంగతి తెలిసిందే. ఆయనను తెలంగాణకే పరిమితం చేసింది.