గత ఐదేళ్లలో ప్రాజెక్టులు శిలాఫలకాలకే పరిమితమయ్యాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ శిలాఫలకాల వద్ద ఫోటోలు తీసుకోవడానికే సరిపోయిందన్నారు. శిలాఫలకాల కోసమే ఖర్చు చేయడం తప్ప ప్రాజెక్టు పూర్తి చేద్దామన్న ధ్యాస లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల అంచనాలు పెంచుకుంటూ వెళ్లారన్నారు.