న్యూఢిల్లి : మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయమై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరుపుతోంది. కాంగ్రెస్తో సమానంగా తమకు సీట్లు కేటాయించాలని ఎన్సిపి కోరుతోంది. సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీల మధ్య చర్చ జరిగిందని పార్టీ నేత ఒకరు చెప్పారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగా, ఎన్సిపి నాలుగు స్థానాల్లో విజయం సాధించిది. ఎన్సిపి 21 స్థానాల్లో పోటీ చేయగా, కాంగ్రెస్ 26 స్థానాల్లో పోటీ చేసింది. ఎన్సిపి, కాంగ్రెస్ల మధ్య 1999నుంచి పొత్తు కొనసాగుతోంది.