కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్పై ఇవాళ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఎమ్మెల్యేల పిటిషన్పై వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ఇవాళ ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరించనుంది. 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. స్పీకర్ తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడం లేదని 15 మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జులై 18న బల నిరూపణ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది.