నేడు ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, బీజేపీ పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకురాబోయే కీలకమైన బిల్లులకు సంబంధించి మోడీ, త్ షా పార్టీ నాయకులకు వివరించారు. పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులు.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీలు హాజరుకావాల్సిందే అని.. ఎవ్వరుకూడా డుమ్మా కొట్టకూడదని సూచించారు. పార్లమెంట్ సమావేశాల గైర్హాజరును పార్టీ సీరియస్ గా తీసుకుంటుందని చెప్పారు. బీజేపీ ఎంపీలు వారి వారి నియోజకవర్గాల అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుండాలని ప్రధాని మోడీ సూచించారు. బీజేపీ ఎంపీలుగా గెలిచినవారిలో ఎక్కువమంది కొత్తవాళ్లే ఉన్నారని…. ప్రజల అభిప్రాయాలకు తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కేంద్రం పథకాలు మారుమూల పల్లెలకు చేరేలా ఎంపీలే బాధ్యత తీసుకోవాలని సూచించారు.