ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాపు రిజర్వేషన్ల అంశంపై మాటల యుద్ధం నడుమ ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాపులను బీసీలలో చేరుస్తామని టీడీపీ మోసం చేసిందని సీఎం జగన్ ఆరోపిస్తే.. మేం చేసిందే మోసం అయితే అప్పుడు వైఎస్ చేసింది దగా అని.. ఇప్పుడు కాపుల రిజర్వేషన్లపై ప్రభుత్వ వైఖరి చెప్పాలని.. ఐదు శాతం రిజర్వేషన్ కోటా అమలు చేస్తారా? అన్నది సీఎం స్పష్టత ఇవ్వాలంటూ సభలో సమరం జరిగింది.