భారత క్రికెట్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీమిండియాకు కొత్త కోచ్ను ఎంపిక చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, ఫిజియోథెరపిస్ట్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుత హెడ్కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ ప్రపంచకప్తోనే ముగిసింది. త్వరలో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో శాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కాంట్రాక్ట్ను మరో 45 రోజులు పొడిగించారు. వరల్డ్కప్ వైఫల్యం తర్వాత ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాత్, ట్రైనర్ శంకర్ బసు ఇప్పటికే తప్పుకున్న విషయం తెలిసిందే. రవిశాస్త్రి తర్వాత కొత్త గురువు ఎవరని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.