రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ శాసనసభ సమావేశాల్లో బొత్స మాట్లాడుతూ… పేదవారిని గత ప్రభుత్వం దోచుకుందన్నారు. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణశాఖలో అనేక అక్రమాలు జరిగాయన్నారు. గత ఐదేళ్లలో విశాఖలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. తెల్లకార్డు ఉన్న పేదలకు ఇళ్లు ఇస్తామన్నారు.