విజయవాడల ఇంద్రకీలాద్రిపై శాకంబరిదేవి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. మూడు రోజుల పాటు దుర్గమ్మ కూరగాయలు, పండ్ల రూపంలో దర్శనమిచ్చారు. ఈరోజు దుర్గమ్మ డ్రైఫ్రూట్స్ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు దర్శన అవకాశం కల్పించనున్నారు.