కర్ణాటకలో పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ విప్ జారీ చేసింది. ఈ నెల 18న కర్ణాటక అసెంబ్లిలో జరిగే బలపరీక్ష సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ విప్ జారీ చేసింది. సభకు పార్టీ సభ్యులందరు హాజరుకావాలని సూచించింది. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాతో సంకీర్ణ ప్రభుత్వం సంకటంలో పడిన విషయం తెలిసిందే. కాగా 18న అసెంబ్లిలో సీఎం కుమారస్వామి బలపరీక్షను ఎదుర్కోనున్నారు.