ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేత‌నం పెంపు స‌రే.. బ‌కాయిల మాటేమిటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2019, 12:47 AM

ఓ వైపు జీతాలు పెంచామ‌ని చెపుతున్నా  త‌మ‌కు 6 నెలలుగా బకాయి పడిన వేతనాలు, పారితోషికాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ  వేలాది ఆశా వర్కర్లు విజయవాడకు తరలివచ్చి భారీగా ధ‌ర్నా చేసారు.  సోమ‌వారం ఈ జ‌రిగిన ధ‌ర్య‌నాలె రాష్ట్ర ప్రభుత్వం  రూ.10 వేలు పారితోషికాలను అందిస్తామ‌ని ప్ర‌క‌టించింద‌ని, దీనితో ముడి పెట్టకుండా గౌరవ వేతనంగానే ఇవ్వాలని, ఇందుకు అనుగుణంగా  జీ.ఓ. స‌త్వ‌ర‌మే విడుదల చేయాలని డిమాండుచేసారు. 


త‌మ‌పై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు పెరుగుతున్నాయ‌ని వీటిని ప్రభుత్వం వెంటనే  ఆపాల‌ని, త‌మ సమస్యలు పరిష్కారం చేయాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


 ఈ కార్య‌క్ర‌మంలో ఆశా వర్కర్ల యూనియన్ (CITU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు వై.నాగలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ధనశ్రీ, ప్రధాన కార్యదర్శి ఎం.కమల, సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్.బాబూరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఎ.వెంకటేశ్వరరావు, ఎన్.సిహెచ్.శ్రీనివాస్, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం సంఘాలు జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్రజ తదితరులు పాల్గొన్నారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com