గురుపూర్ణిమను పురస్కరించుకుని టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 16వ తేదీ మంగళవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ‘శ్రీకూర్మ మహాపురాణము’ గ్రంథావిష్కరణ జరుగనుంది. టిటిడి టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| సముద్రాల లక్ష్మణయ్య ఆధ్వర్యంలో జరుగనున్న ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.