ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆధార్‌ సంఖ్య ఇవ్వకపోతే 10 వేల జరిమానా...!

national |  Suryaa Desk  | Published : Sun, Jul 14, 2019, 05:49 PM

ప్రజల నెత్తిన భారం మోపేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. అత్యధిక మొత్తంలో విలువైన లావాదేవీలకు సంబంధించిన పత్రాలలో ఆధార్‌ సంఖ్యను సమర్పించనట్లయితే వారికి రూ. 10 వేల రూపాయల జరిమానా విధించనుంది. సంబంధిత చట్టాలకు సవరణలు, నోటిఫికేషన్‌ జారీ చేసిన అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్‌ నుండి జరిమానా నిబంధన అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతూ ఐటి రిటర్న్‌ దాఖలు చేసేవారికి పాన్‌ కార్డు లేనట్లయితే ఆధార్‌ సంఖ్యను ఇచ్చేందుకు కేంద్రం అనుమతిస్తుందని పేర్కొన్నారు. పాన్‌ కార్డు అవసరమైన చోటల్లా ఆధార్‌ను కూడా వినియోగించవచ్చునని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 120 కోట్ల ఆధార్‌ కార్డులు జారీ అవ్వగా, 41 కోట్ల పాన్‌ కార్డులు జారీ అయ్యాయి. వీటిలో 22 కోట్ల పాన్‌ కార్డులు ఆధార్‌తో అనుసంధానించి ఉన్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com