ఉండవల్లి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజావేదిక కూల్చివేత కొనసాగుతూ ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పక్కనే మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉండటంతో.. ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా.. మరోవైపు కరకట్టను పూర్తిగా వాళ్ల ఆధీనంలోకి తీసుకుంది భద్రతా సిబ్బంది. కూల్చివేత ప్రక్రియను సీఆర్డీఏ అడిషనల్ కమీషనర్ విజయకృష్ణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే మంగళవారం నుంచి ప్రజావేదిక కూల్చివేత కొనసాగుతుండగా.. ఇవాళ మధ్యాహ్నం వరకూ ప్రజావేదికను పూర్తిగా కూల్చేస్తామని అధికారులు పేర్కొన్నారు.