స్వీడన్లోని బ్లెకిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ టెక్నాలజీ (బిటిహెచ్తో) ఆంధ్రవిశ్వవిద్యాలయం తన సహకార అనుబంధాన్ని మరో ఐదేళ్లకాలానికి పొడిగించింది. ఈ మేరుకు ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు, బిటిహెచ్ ప్రతినిధి ఆచార్య మేట్స్ వైబర్గ్లు నూతన అవగాహ ఒప్పందంపై మంగళవారం స్వీడన్లో జరిగిన కార్యక్రమంలో అవగాహన ఒప్పందం చేసుకున్నామని ఆంధ్రా యూనివర్శిటీ ప్రకటించింది. తమ విద్యాలయంతో సంయుక్తంగా బిటిహెచ్ నాలుగు సంవత్సరాల బేచలర్ ఆఫ్ టెక్నాలజీ తోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులను నిర్వహిస్తామని, దీనిలో భాగంగా విద్యార్థులు మూడు సంవత్సరాలు ఏయూలోను, ఒక సంవత్సరం బిటిహెచ్లో చదవాల్పి ఉంటుందని, కోర్సు పూర్తిచేసిన తరువాత పీజీ కోర్సును బిటిహెచ్లో పూర్తిచేసే అవకాశం కల్పిస్తారని తెలిపింది. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఏయూ అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య ధనుంజయ రావు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాస రావు, బిటిహెచ్ ఇండియా ఇనీషియేటివ్ గరుదత్త్, బిటిహెచ్ డీన్లు లాండ్బర్గ్, బెన్నీ లోవస్ట్రార్మ్ తదితరులు పాల్గొన్నారు.