గంజాయి ఏరివేతకు ఆగస్టులో భారీ ఆపరేషన్ నిర్వహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా సీఎం మాట్లాడుతూ… గంజాయి సాగు చేయకుండా గిరిజనుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. గిరిజనుల జీవనోపాధికి మార్గాలను చూపుతామన్నారు. పోలవరం పునరావాస సమస్యపై దృష్టి పెట్టాలన్నారు. ఫిర్యాదులు, అభ్యంతరాల పరిష్కారానికి గ్రీవెన్స్ కార్యాలయం పెట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. అన్ని ప్రాజెక్టుల కన్నా దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.కాల్ మనీ సెక్స్ రాకెట్ ఘటనలు మళ్లీ జరగకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏ పార్టీ వారు ఉన్నా విడిచిపెట్టొద్దని పోలీసులకు సీఎం జగన్ ఆదేశించారు. పోలీసు వ్యవస్థను క్లీన్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎవరికి ఫిర్యాదు వచ్చినా వెంటనే పరిష్కారం చూపాలన్నారు.