ఎమ్మెల్యేలతో తాను క్యాంపు నడుపుతున్నట్లు అసత్య ప్రచారం చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో ఆయన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను కొలంబో వెళ్లిన మాట వాస్తవమని, తనతో ఒక్క ఎమ్మెల్యే కూడా రాలేదన్నారు. ప్రచారాలు నాపై కొత్త కాదని భవిష్యత్లోనూ వస్తాయన్నారు.