లక్నో : ఉత్తరప్రదేశ్లోని దియోరియా రైల్వేస్టేషన్లో ప్రయాణికులు రెచ్చిపోయారు. రైలు టికెట్ల కోసం క్యూలైన్లో నిల్చొవాలని ఆదేశించిన జీఆర్పీ పోలీసుపై ఇద్దరు ప్రయాణికులు చేయి చేసుకున్నారు. రైల్వే పోలీసును అసభ్యకర పదజాలంతో దూషిస్తూ స్టేషన్ బయటకు ఈడ్చుకెళ్లి తీవ్రంగా చితకబాదారు. గాయాలపాలైన పోలీసును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుపై దాడి చేసిన ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.