లక్నో: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మొరాదాబాద్-ఆగ్రా జాతీయ రహదారిపై లెహ్రాన్ వద్ద ట్రాక్టర్ ట్రాలీని పాల లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ట్రాక్టర్ ట్రాలీలో ప్రయాణిస్తున్న పెండ్లి బృందంలో 8 మంది వ్యక్తులు మృతిచెందారు. 24 మందికి గాయాలయ్యాయి. బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా కోత్వాలీ ప్రాంతంలోని దల్వాల్ గ్రామవాసులు.