పోలీస్ శాఖలో వీక్లీ ఆఫ్ లు ఇవ్వాలనే సీయం నిర్ణయంపై చర్చలు జరిపామని అన్నారు అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్. మొత్తం 19 మోడల్స్ ని ఎంపిక చేశామని,యూనిట్ ఆఫీసర్స్ ఏదోక మోడల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చునన్నారు. ప్రతి యూనిట్ నుండి ఫీడ్ బ్యాక్ తీసుకొని కొన్ని రోజులకి మార్పులు చేర్పులు చేస్తామని ఆయన చెప్పారు. 70 వేల పోలీసులకి ఐటీ ప్లాట్ తయారు చేసి పారదర్శకంగా డాష్ బోర్డ్ అమలులోకి తీసుకురాబోతున్నామని, కానిస్టేబుల్ నుండి ఇన్స్పెక్టర్ స్దాయి వరుకు వీక్లీ ఆఫ్ లు అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు.
వీక్లీ ఆఫ్ లతో షిఫ్ట్ డ్యూటిస్ కూడా ఉంటాయని,రాష్ట్రంలో 20% ఖాళీలను భర్తిలను చేయబోతున్నాం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12300 ఖాళీ ఉన్నాయి.కమిటి రిపోర్ట్ లో దీనిపై చర్చించాం. విశాఖ, కడప, ప్రకాశంలో ట్రైల్స్ చేశాం.అధికారుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ప్రతి రెండు నెలలకొకసారి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాంమని అన్నారు. రేపటి నుండి ఏపి పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలులోకి వస్తుందని మరోసారి స్పష్టం చేశారు.
వీఐపీ, యాంటి నక్సల్ డ్యూటి కోసం ఇబ్బంది రాకుండా వీలైనంత త్వరగా ఖాళీలు భర్తి చేస్తాం.అవసరం అనుకుంటే హెడ్ క్వార్టర్స్ సిబ్బందిని ఉపయోగించుకుంటాం. పోలీసులకి ఒత్తిడి వల్ల స్ట్రోక్స్ , కిడ్ని , షుగర్ వ్యాదులు ఎక్కువ అవుతున్నాయి. రిటైర్ అయిన పదిపదిహేళ్లలోనే పోలీసులు చనిపోతున్నారు. అవసరమైతే వీఆర్ లో ఉన్నవాళ్లని, పనిష్మెంట్లు తీసుకున్న వారిని కూడా తీసుకుంటామని అడిషనల్ డీజీ చెప్పారు.