ప్రత్యేక హోదాపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత సలహాలు తమకు అవసరంలేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం ఓ పెద్ద కుంభకోణమని ఆరోపించారు. అమరావతిలో ఎలాంటి అక్రమాలు జరిగాయో విచారణలో తేలుతుందన్నారు. ఈ వ్యవహారంపై తాము మొదట్నుంచీ అనుమానాలు వ్యక్తంచేస్తున్నామని తెలిపారు.