ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో డెయిరీ రంగంపై దృష్టి పెట్టారు. పాడిరైతులకు మేలుకలిగించే విధానాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. దానికోసం డెయిరీ రంగంలో అనుభవం ఉన్న వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సలహాలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి పెద్దిరెడ్డి, బ్రహ్మనాయుడు, అధికారులతో ప్రత్యేక కమిటీని కూడా వేయాలని సీఎం జగన్ యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుండగా ఇదే విషయంపై మరోసారి భేటీ కానున్నట్లుగా తెలుస్తుంది.