ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2019, 04:24 PM

 ఆంధ్రప్రదేశ్‌లోని అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఇవాళ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా.. ఆమెకు పార్టీ కండువా కప్పి కమలం గూటికి ఆహ్వానించారు. గతేడాది స్థాపించిన జనజాగృతి రాజకీయ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. పార్టీ అధిష్ఠానం తనకు ఏ పదవి, బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని ఆమె పేర్కొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి అరకులోయ ఎంపీగా గెలుపొందిన గీత ఆ పార్టీకి దూరంగానే ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com