ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లకు భద్రత కల్పించాలన్న పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. బెంగాల్ లో డాక్టర్లు సోమవారమే సమ్మె విరమించడంతో, అత్యవసరంగా ఈ పిటిషన్ పై విచారణ అవసరం లేదని.. జస్టిస్ దీపక్, సూర్య కాంత్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తాము డాక్టర్లకు రక్షణ కల్పించడాన్ని వ్యతిరేకించడం లేదని..ఈ అంశాన్ని ఓ విశాల కోణంలో చూడాల్సిన అవసరముందని సుప్రీం పేర్కొంది.