ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీలో ఘోర ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2019, 01:10 PM

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లక్నో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో 40 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com