దశల వారీగా ఏపీలో మద్య నిషేధానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఏపీ సీఎం జగన్ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులను తొలగించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బెల్ట్ షాపుల తొలగింపు పై ఎక్సైజ్ అధికారులతో సమీక్ష జరిపిన జగన్ గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులు వందశాతం తొలగించాలని చెప్పారు. మద్యం దుకాణాదారుల లైసెన్స్లను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. మద్య నిషేధానికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.