అమరావతి: కరకట్టపై అక్రమ నిర్మాణాలకు సంబంధించి కోర్టులకు వెళ్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శాసనసభ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరకట్ట పక్కనున్న నివాసం నుంచి చంద్రబాబును ఖాళీ చేయిస్తామన్నారు. రాజధాని పనులు ఆగిన విషయం నాకు తెలియదన్నారు. పనులు ఎందుకు నిలిపివేశారో గుత్తేదారులు సమాధానం చెప్పాలన్నారు. గుత్తేదారులకు అనుమానాలు ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు. సీఆర్డీఏ ఛైర్మన్గా సీఎం ఉంటారు… ఆ పోస్టు నాకు ఇస్తారన్న విషయం తెలియదన్నారు. అమరావతిలో ఇల్లు కూడా కట్టుకోని చంద్రబాబు రాజధానిపై మాట్లాడుతున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారన్నారు.