అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇవాళ దేశ రాజధాని ఢిల్లి వెళ్లనున్నారు. అసెంబ్లి సమావేశాలు ముగిశాక సీఎం జగన్ ఢిల్లికి బయల్దేరనున్నారు. రేపు ఢిల్లిలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీల అధ్యక్షులకు ప్రహ్లాద్ జోషి లేఖలు రాసిన విషయం తెలిసిందే.