శాసససభలో తీర్మాణాలు కేంద్రం పట్టించుకోవట్లేదని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రెండోరోజు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రత్యేక హోదాపై గతంలో రెండుసార్లు తీర్మానాలు చేశామన్నారు. ఇప్పుడు చేస్తూ మూడో తీర్మాణం అవుతుందన్నారు. శాసనసభలో తీర్మానాలు కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు. జగన్ హామీల్లో కొత్త పథకాలు నెరవేర్చడానికి పాత పథకాలు రద్దు చేస్తున్నారన్నారు. నిధుల వెసులుబాటు చూసుకోకుండా హామీలు ఇచ్చారన్నారు. రూ.43వేల కోట్లు ఎక్కణ్నుంచి వస్తాయో చూసుకోవాలన్నారు.