పెద్ద అనుభవం, పెద్ద వయసు ఉండటం కాదని.. పెద్ద హృదయం కావాలంటూ టీడీపీకి చురకలు అంటించారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి రోజు సమావేశాలలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతికి సభ సంతాప తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం సభలో మాట్లాడిన మంత్రి రాష్ట్ర విభజన తర్వాత అనుభవజ్ఙుడైన వారికి పాలనా పగ్గాలిస్తే, రాష్ట్రం నిలదొక్కు కుంటుందనే ప్రజలకు చంద్రబాబుకు అవకాశం కల్పించినా, ఆయన సద్వినియోగ పరచుకోలేక పోయారని అవంతి ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పెడితే చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ నేతలకు వంగి వంగి సలాంలు చేస్తూ, ప్రజలతో ఛీకొట్టించుకున్నారని వ్యాఖ్యానించారు. అవంతి ప్రసంగిస్తున్నంత సేపూ తెలుగుదేశం పార్టీ సభ్యులు అడ్డుకుంటునే ఉన్నారు.