ఢిల్లీలో సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ అయ్యింది. భేటీకి కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకే ఆంటోని, జైరాం రమేశ్, ఆజాద్, చిదంబరం, ఇతర నేతలు హాజరయ్యారు. లోక్సభా పక్ష నేతను కాంగ్రెస్ ప్రకటించనుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికపైనా కాంగ్రెస్ చర్చించనుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై సోనియాగాంధీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.