న్యూఢిల్లి :కేంద్ర మాజీ మంత్రి జెపి నడ్డా బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. బిజెపి అధ్యక్షుడిగా అమిత్షా కొనసాగనున్నారు. ప్రధాని మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత అమిత్షాను మంత్రివర్గంలోకి తీసుకుని కీలకమైన హోంశాఖ ఇవ్వడంతో ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని ఊహాగానాలు చెలరేగాయి. అయితే వాటికి తెరదించుతూ ప్రస్తుతానికి రెండు పదవులను అమిత్షా నిర్వహించనున్నారు. అయితే పార్టీకి సంబంధించిన బాధ్యతలు జెపి నడ్డా నిర్వహిస్తారు.