ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్‌ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 17, 2019, 02:58 PM

అమరావతి : విజయవాడ తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నివాసానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ను సీఎం కేసీఆర్‌ ఆహ్వానించనున్నారు. ఇరువురు సీఎంలు భోజనం చేసిన అనంతరం విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలపై చర్చించనున్నారు. 9, 10వ షెడ్యూళ్లలోని ప్రభుత్వ రంగ సంస్థల విభజన, విద్యుత్‌ ఉద్యోగుల విభజన, పెండింగ్‌ బిల్లులు, ఇరు రాష్ర్టాల మధ్య నీటి వివాదాల పరిష్కారంపై చర్చించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com