ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కలుసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో టీడీఎల్పీకి కార్యాలయాన్ని కేటాయించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన స్పీకర్ తమ్మినేని వీలైనంత త్వరగా ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ఏపీ మంత్రులు, ఉపముఖ్యమంత్రులకు ప్రభుత్వం ఛాంబర్లను కేటాయించిన సంగతి తెలిసిందే. బ్లాక్ 2లో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స, మేకతోటి సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్, బాలినేని శ్రీనివాసరెడ్డిలకు ఛాంబర్లు ఇచ్చారు. అలాగే బ్లాక్-3లో పాముల పుష్పశ్రీవాణి, విశ్వరూప్ లకు, బ్లాక్-4లో మంత్రులు కొడాలి నాని, మోపిదేవి, అనిల్ కుమార్, మేకపాటి గౌతంరెడ్డి తదితరులకు ఛాంబర్లు కేటాయించారు.