అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. ఢిల్లిలో పోలవరం కేంద్రం తీసుకుంటుందన్నారు… అమరావతికి వచ్చాక పోలవరం మేమే పూర్తి చేస్తామని జగన్ అన్నారన్నారు. పట్టిసీమ పనికి వచ్చే ప్రాజెక్టు కాదనుకుంటే మూసివేయండన్నారు. ఏపీ అన్ని రంగాల్లో ముందుందని ప్రధాని మోడీ జగన్కు చెప్పారని, అటువంటి అభివృద్ధినే కొనసాగించాలని మోడీ జగన్కు చెప్పారన్నారు. కొత్త ప్రభుత్వం పాలన మీద దృష్టి పెడితే మంచిదన్నారు.