అమరావతి: రాష్ట్ర ప్రజలు పూర్తి విశ్వాసం, నమ్మకంతో జగన్ను గెలిపించారని ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు అన్నారు. శాసన సభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసాన్ని నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పించారన్నారు. గత ప్రభుత్వ నేతలు ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారన్నారు. ప్రాజెక్టుల్లో పారదర్శకత కోసం రివర్స్ టెండరింగ్ చేపడతామన్నారు. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నదే లక్ష్యమన్నారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని స్పష్టంగా చెబుతున్నామన్నారు.