అమరావతి: శాసన సభలో గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్షాలు విమర్శించాయని ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు అన్నారు. శాసన సభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాన్ని ఏ విధంగా గౌరవించాలో తెలుసుకోమని చంద్రబాబుకు ఆనాడే సీఎం జగన్ చెప్పారన్నారు. గత ప్రభుత్వం ప్రత్యేక హోదాపై మాట్లాడకుండా నోరు నొక్కేసిందన్నారు. పోలవరం పూర్తి కాక పోవడానికి ప్రధాన కారణం టీడీపీ ప్రభుత్వమేనని విమర్శించారు.