ఏపీలో జగన్ సీఎంగా 30వ తేదీ ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు జగన్ ప్రమాణం చేసేలా ముహూర్తం ఇప్పటికే నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యే అవకాశాలున్నాయి. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మోడీ తిరిగి ఢిల్లీ చేరుకుని పీఎంగా ప్రమాణస్వీకారానికి సన్నద్ధమవుతారని వైసిపి వర్గాల సమాచారం.