తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈఓ ఎం విసురేష్ బాబు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు సౌలభ్యం దృష్ట్యా కొన్ని కీలక నిర్ణయాలు చర్చించామని. భక్తులు రూమ్ తీసుకోవాలన్నప్పుడు సి ఆర్ ఓ ఆఫీసు నందు దరఖాస్తు పూర్తి చేసి, ఆధార్ కార్డు జతపరిచి, బయోమెట్రిక్ ద్వారా రూమ్ తీసుకోవాలని, ఖాళీ చేసేటప్పుడు కూడా బయోమెట్రిక్ ద్వారా ఖాళీ చేయాలని, కార్తీకమాసంలోని రద్దీ సమయంలో రూము తీసుకోన్న సమయం నుండి 12 గంటలు మత్రమే భక్తులకు రూమ్ కేటాయించడం జరుగుతుంది అని ఆతర్వత ఖాళీ చేయాలని తేలీపారు.శ్రీ స్వామివారి వ్రతములు దర్శనం కొరకు వచ్చే భక్తులు తప్పనిసరిగా (పురుషులు పంచ కండువా, కుర్తా పైజామా) (స్త్రీలు చీర ,జాకెట్టు ,పంజాబి, డ్రెస్ , చున్ని) డ్రెస్ కోడ్ ను భక్తులు పాటించే విధంగా వ్రతములు మరియు ఆలయం విభాగం వారికి ఈవో సురేష్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.