ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనే కాదు.. లోక్సభ స్థానాల పరంగా కూడా వైసీపీ దూకుడు కనబరిచింది. ఏకంగా 25 స్థానాలకుగానూ 22 స్థానాలలో విజయం సాధించింది. వీరిలో ఒకరు ఇప్పుడు దేశంలోనే ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అరకు నుంచి గెలిచిన గొడ్డేటి మాధవి దేశంలో చిన్న వయసు ఉన్న ఎంపీగా రికార్డులెక్కారు. ఈమె వయసు కేవలం 25 ఏళ్ల మూడు నెలలు మాత్రమే. కాంట్రాక్టు ఉద్యోగిని పనిచేస్తున్న ఆమెకు అనూహ్యంగా వైసీపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆమె ఏకంగా కేంద్ర మాజీ మంత్రి కిషోర్చంద్రదేవ్ను ఓడించి ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టబోతున్నారు. అంతేగాక చిన్న వయసులో ఎంపీగా ఎన్నికైన మహిళగా రికార్డు సాధించారు. ఆమె తర్వాత స్థానంలో కర్ణాటకలోని బెంగళూరు సౌత్ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, హసన్ స్థానం నుంచి గెలిచిన ప్రజ్వల్ రేవణ్న 28 ఏళ్ల వయసుతో ఉన్నారు. వీరిలో ప్రజ్వల్ రేవణ్న స్వయానా మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు.