మా ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందని జగన్ చెప్పారు. అవినీతిరహిత పాలన అందిస్తాం. అవినీతి జరిగిందని తెలిస్తే కాంట్రాక్ట్లు రద్దు చేస్తాం. చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి నాపై కేసులు వేశాయి. మా నాన్న సీఎంగా ఉన్నప్పుడు నేను సచివాలయంలో అడుగుపెట్టలేదు. పోలవరంలో కుంభకోణం జరిగితే విచారణ చేపడుతాం. 30న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తా. మరో వారం, పదిరోజుల్లో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తా. ప్రమాణస్వీకారం తర్వాత శాఖలవారీగా సమీక్ష చేస్తా. ఎన్డీఏ మెజార్టీ 250 దగ్గరే ఆగిపోతే బాగుండేది. ప్రత్యేక హోదాపై సంతకం పెట్టించుకుని మద్దతిచ్చేవాళ్లమని జగన్ వ్యాఖ్యానించారు.