న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. పొరుగు రాష్ర్టాలతో సత్సంబంధాలు ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు ఇచ్చారు. రాష్ర్టానికి అందాల్సిన సహాయం ఆలస్యమైంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కూడా మర్యాదపూర్వకంగా కలిశాను. ప్రజలకు చెప్పినవన్నీ అమలు చేస్తాం. ఐదేళ్లలో ఏపీలో జరిగిన కుంభకోణాలు అందరికీ తెలుసు. రాజధానిలో బినామీలతో తక్కువ ధరకు భూములు కొనిపించారు. ల్యాండ్ పూలింగ్లో బినామీలను వదిలేసి రైతుల భూములు తీసుకున్నారు. రాజధాని భూముల్లో అతిపెద్ద కుంభకోణం జరిగింది. నచ్చినవారికి తక్కువ ధరకు భూములు అమ్మేశారని జగన్ ఆరోపించారు.