అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో ఇవాళ ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారులు భేటీ కానున్నారు. ఉదయం 11.30 గంటలకు సీఈవో ద్వివేది నేతృత్వంలో అదనపు సీఈవోలు వివేక్, సుజాత శర్మలు గవర్నర్ను కలవనున్నారు. ఏపీ రాష్ట్రంలో ఎన్నికైన శాసన సభ్యుల జాబితాను గవర్నర్ నరసింహన్కుకు అధికారులు సమర్పించనున్నారు.