జమ్ము కాశ్మీర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పీడీపీ ఒక్కసీటును కూడా గెలవకపోవటంపై ఆ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పందించారు. 2014 అసెంబ్లి ఎన్నికల అనంతరం బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ప్రజలు ఆగ్ర హంతో ఉన్నారని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. బీజేపీ మిత్రపక్షంగా ఉండాలన్న తమ నిర్ణ యంపై ప్రజలు ఆగ్రహం చెందటంతోనే ఇటీవల జరి గిన సార్వత్రిక ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఓటమిపాలైందని తెలిపారు. లోక్సభ ఎన్ని కల్లో దక్షిణ కాశ్మీర్లో పీడీపీ కంచుకోటలో పరాజయం పొందటం తనను ఆశ్చర్యపరిచిందని ఆ పార్టీ అధ్యక్షు రాలు, జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. తమ పార్టీ ఓటమికి బీజేపీతో 2014లో కుదుర్చుకున్న ఒప్పందం కీలకపాత్ర పోషించింద ని ముఫ్తీ అన్నారు. ప్రజలు తమ ఆగ్రహాన్ని ఓట్ల ద్వారా తెలియ జేశారని అనంత్నాగ్ మాజీ ఎం పీ మెహబూబా ముఫ్తీ తెలిపారు. రాజకీయాల్లో భాగంగా ఎన్నికలు వస్తూ పోతుంటాయని..గెలుపు ఓట ములు సహజం అన్నారు. కాశ్మీర్ ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక దృక్పథంతో ముఫ్తీ సాబ్ పార్టీని స్థాపించారని ఆయన ఆశయాన్ని కొనసాగి స్తామని పీడీపీ చీఫ్ ముఫ్తీ మీడియాకు ఇచ్చిన ఇంట ర్వ్యూలో తెలిపారు. కాశ్మీర్ తీర్మానం మా అజెండా అని దానికోసం పోరాడుతామని ఆమె తెలిపారు. కాశ్మీర్లో ప్రతిరోజు రక్త పాతం జరుగుతుందన్నారు. గత ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ మూడు స్థానాలు కోల్పోయిందని అప్పుడు మా పార్టీ గెలిచిందన్నారు. రాజకీయా ల్లో ఇదంతా భాగం అన్నారు. రైతు సమ స్యలు, జీఎస్టీ, నిరుద్యోగం, నోట్లరద్దు, ఆర్థిక రంగం క్షీణించటం వంటి ఎన్నో సమస్యలు ఉన్నా బీజేపీ ఎలా గెలిచిందో తనకు తెలియటం లేదన్నారు.