ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బేగంపేట నుంచి ఢిల్లీ బయల్దేరిన జగన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 26, 2019, 08:02 AM

హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లి బయల్దేరారు. జగన్‌తో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు కూడా ఉన్నారు. ఢిల్లిలో ప్రధాని నరేంద్ర మోడీని జగన్‌ కలవనున్నారు. ఉదయం 10.40 గంటలకు మోడీని ఆయన నివాసంలో కలవనున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన మోడీకి జగన్‌ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలపనున్నారు. ఈ నెల 30న ఏపీ సీఎంగా తాను చేసే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా జగన్‌ కోరనున్నారు. అలాగే రాష్ట్రంలోని సమస్యలను జగన్‌ ప్రధాని దృష్టికి తీసుకెళనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరనున్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని హా మీలను సత్వరమే నెరవేర్చాలని కోరనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించి కేంద్రం సాయమందించాలని కోరనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com