ట్రెండింగ్
Epaper    English    தமிழ்

30న మధ్యాహ్నం 12.23కు జగన్ ప్రమాణం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 25, 2019, 09:44 PM

వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 30వతేదీన ఇందిరా గాంధీ స్టేడియంలో మధ్యాహ్నం 12.23 గంటలకు సీఎం గా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని రాజ్ భవన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ లో గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ ను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. వైసీపీ శాసనసభా పక్షం నేతగా జగన్ ను ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యేలు బొత్స సత్యానారాయణ, ధర్మాన ప్రసాద రావులు గవర్నర్ కు లేఖ అందచేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు వైసీపీని గవర్నర్ ఆహ్వానించారు.
29నే విజయవాడకు గవర్నర్, కేసీఆర్:గవర్నర్ నరసింహన్ దంపతులు, సీఎం కేసీఆర్ దంపతులు 29వ తేదీన విజయవాడ వెళ్లనున్నారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా జగన్ గవర్నర్, సీఎం ను ఆహ్వానించారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com