శ్రీవారు జన్మించిన శ్రవణానక్షత్రాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ”అన్నమయ్య హరిదాస్యం” సంకీర్తనల సిడిని ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి ఆవిష్కరించారు. టిటిడి ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ సంకీర్తనలను రికార్డు చేశారు. ఇందులోని సంకీర్తనలను అన్నమాచార్య ప్రాజెక్టు గాయకులు శ్రీ గురజాడ మధుసూదనరావు స్వరపరిచగా ఆయనతోపాటు శ్రీ శివప్రసాద్, శ్రీ రఘునాథ్ గానం చేశారు.ఈ సందర్భంగా గాయకులను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం వారు ఈ సంకీర్తనలను పాడి వినిపించారు.ఈ సంకీర్తనలను టిటిడి వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. భక్తులు ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.